కోనరావుపేట పీహెచ్సీలో పాము కలకలం
కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం పాము ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అక్కడే ఉన్న స్థానికులు మాంధాల శ్రీనివాస్, రాస రవీందర్, దండు రాజు, సుర రాజయ్య, అల్లెపు వినోద్ తదితరులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పామును చంపివేయడంతో ప్రమాదం తప్పింది.
01-04-2026