3 April, 2026 | 12:08 AM

Districts - Rajanna Sircilla

article_51134881.webp
శివంగాలపల్లి గ్రామ సభలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలపై అవగాహన

కోనరావుపేట ఏప్రిల్ 02 (విజయక్రాంతి): శివంగాలపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలపై గ్రామ ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే గ్రామ అభివృద్ధి ప్రణాళికపై చర్చిస్తూ, భవిష్యత్ అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు.ఈ గ్రామ సభలో సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను తెలియజేసి, అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు అందించారు.

02-04-2026

article_17708165.webp
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా పాలన

బోయినపల్లి: ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని బోయినపల్లి ప్రత్యేక అధికారి ఎంపీడీవో జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో సర్పంచ్ నల్లమోహన్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా ఏ ఏం సి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ హాజరయ్యారు.ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. అనంతరం గ్రామంలో జరిగిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు, నిధుల గురించి సర్పంచ్ నల్లమోహన్ ప్రజలకు వివరించి చెప్పారు.ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

02-04-2026